Wednesday, July 8, 2020

కర్ణాటక ప్రభుత్వ ఉపాద్యుల ఔదార్యం

హైదరాబాద్ : 09/07/2020

*Humanity of karnataka govt. teachers*

కర్నాటకలో లక్షా 40వేల మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. *ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల వారిలో చాలా మందికి గత మూడు నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదు.* ఈ క్రమంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని కోరాయి.

ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని చెప్పిన ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ముందుకురావాలని పిలుపునిచ్చింది. *పెద్ద మనసుతో తోటి టీచర్లను ఆదుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే కర్నాటక స్టేట్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది*.కర్నాటకలోని ప్రభుత్వ స్కూళ్లలో 2.20 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ స్కూల్ టీచర్లంతా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే..

*దాదాపు రూ.30 కోట్లు సమకూరుతాయి.* ఆ నిధులతో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వ స్కూల్ టీచర్లు తెలిపారు. టీచర్స్ వెల్ఫేర్ ఫండ్‌ని కూడా వినియోగించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా విద్యాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందరి వివరాలను సేకరించిన తర్వాత..నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమచేయనున్నారు. *ప్రభుత్వ స్కూల్ టీచర్లు చేసిన ఈ మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.*

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment