Monday, December 26, 2022

భారతదేశంలో మీ స్థాయి ఏమిటి.?

*_కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?_*
_● బాబుకు తెలంగాణలో పనేమిటా..!?_
_● పక్కోడు చేస్తే వ్యభిచారం
మనం చేస్తే శృంగారం.._
_● ఏం బుర్రలు రా మీవి.?_
_●  భారతదేశంలో మీ స్థాయి ఏమిటి.?_
_● అసంబద్ధ వాఖ్యలను తిప్పికోట్టిన తాళ్ళూరి జీవన్_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*

*_స్వతంత్ర భారాతావని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా విహరించే హక్కు ఉంది. అయితే ఇటీవల ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఓ సభ పెట్టింది. అది సక్సెస్ అయింది. దీఃతో గులాబీ దళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చంద్రబాబు తెలంగాణాలోకి వస్తారని గులాబీ నేతల గగ్గోలు. మరి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కి ఎలా వెళతారంటూ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా గట్టి కౌంటర్ ఇచ్చారు._*

*_అసలేం జరిగింది.?:_*
ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు.. నిజంగా గట్టి ప్రశ్నే. టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా.. 'చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని' అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..? ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…!

*_ఈ ప్రశ్నకు బదులేది.?:_*
గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా... ఆంధ్రా మూలాలున్న ఓటర్లు కనీసం 25 సీట్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరనీ, తమను వదిలేసి వెళ్లిపోయిన చంద్రబాబు పట్ల ఆ ఓటర్లకు కోపమున్నా సరే, వాళ్లు గనుక మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తే, అది కేసీయార్‌కు నష్టమనీ, ఎందుకంటే, వాళ్లంతా ప్రస్తుతం కేసీయార్ వెంటే ఉన్నారనీ ఓ విశ్లేషణ.

*_భయ సందేహమా..?:_*
'నమ్ముతారేమో' అని బీఆర్ఎస్ భయసందేహం. అందుకే ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపడి అసలు చంద్రబాబుకు తెలంగాణలో 'ఏం పని' అని మాటల దాడికి దిగింది..? రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడినని చెప్పుకుంటున్న కేసీయారే ఏపీలో పోటీచేయాలని అనుకున్నప్పుడు... ఆల్‌రెడీ పార్టీ ఉనికి, గత చరిత్ర ఉన్న చంద్రబాబు తెలంగాణలో పోటీచేయడానికి అనర్హుడు ఎలా అవుతాడు..? ఎవరి ఆశలు వాళ్లవి. ఓట్లేయాలా..? లేదా..? అనేది ప్రజల ఇష్టం. ‘లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్నట్టుగా ఆంధ్రులంతా దోపిడీదారులే' అని సూత్రీకరించిన కేసీయార్‌ను ఆంధ్రులు ఎందుకు ఆదరించాలి.? ఆదరిస్తారా..’’ అనేది ఆర్కే భావన.

*_వెక్కిరింపు ధోరణి:_*
అందుకే మొన్న నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ బ్యానర్ స్టోరీని కాస్త వెక్కిరించే ప్రయత్నం కూడా చేశాడు. నిజంగానే ఓ పిచ్చి వార్త అది. ఎవరో ఊరూపేరూ లేని అనామకులు వచ్చి కలిస్తే ఇక ఏకంగా ఆంధ్రాకు కేసీయార్ ఆశాకిరణం అయిపోయాడా.? అనడుగుతున్నాడు ఆర్కే.! ఢిల్లీలో తనను కలిసేది కూడా ఇలాంటి కేరక్టర్లే.. వాళ్లకు రాజమర్యాదలు.. తెలంగాణ ప్రజల సొమ్ము ఏమవుతుందో..? ఎవరికి ఖర్చవుతుందో..? అంతా బభ్రాజమానం భజగోవిందం..!

 *_ఆర్కే మరో ప్రశ్న:_*
‘‘చంద్రబాబు, షర్మిల, పవన్ కల్యాణ్, ప్రవీణ్‌కుమార్ బీజేపీకి తోడుగా గనుక కలిస్తే కేసీయార్‌కే బోలెడు నష్టం కాదా’’.. ఇదీ ప్రశ్న.. ఈ వాదనతో తెలంగాణలో బీజేపీకి టీడీపీ సాయం కావాలంటే, ఏపీలో 'పొత్తు కుదరాలి' అనేది ఆర్కే భావన. పవన్ కల్యాణ్ ఆశ కూడా అదే.. చంద్రబాబు ధ్యాస కూడా అదే.. కానీ తెలంగాణలో వాళ్లెప్పుడూ ఒకతాటిపైకి రారు.. ఎందుకంటే.. షర్మిల ఆల్‌రెడీ జగన్, బీజేపీ కలిపి వదిలిన బాణమే..! ఏ రీతిలో బీజేపీకి ఫాయిదా అనేది వేరే చర్చ… జగన్‌కు ఎలాగూ తెలంగాణ మీద దృష్టి లేదు.! ఉండదు. అసలు షర్మిలకు జనసేన పొడగిట్టదు.

*_ఇదే పొలిటికల్ లాజిక్:_*
బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లకపోవచ్చు గానీ బీఎస్పీ సొంతంగా బరిలో ఉంటుందేమో.! మాయావతి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదు. అది కేసీయార్‌కు నష్టమే.! పవన్ కల్యాణ్ పార్టీకి తెలంగాణలో ఏ రేంజ్ ఉనికి ఉందో డిస్కస్ చేయడం కూడా దండుగే.! ఇలా రకరకాల ‘‘ఉశికె ముడి, పెండ ముడి’’ బాపతు సమీకరణాలు చాలా పనిచేస్తాయి రాబోయే రోజుల్లో.. అంతేతప్ప వాళ్లంతా కలవరు. కేసీయార్‌కు ఉమ్మడిగా నష్టం చేకూర్చలేరు. పైగా హిందూ, క్రిస్టియన్ ఓట్లు రకరకాలుగా చీలిపోతే... కాంగ్రెస్ కేసీయార్ వ్యతిరేక ఓట్లను కొన్ని చీల్చితే.. ముస్లిం ఓట్లు ప్లస్ తన సొంత ఓటు బ్యాంకుతో మళ్లీ అధికారానికి తగిన సీట్లు సంపాదించే చాన్స్ కేసీయార్‌కు ఇప్పటికీ సజీవంగా ఉంది…!! కానీ స్థానిక నేతలంటే అక్కడి ప్రజలకు ఎందుకో 'షింక్' కావడం లేదు.

*_తెలంగాణ రాజకీయ ప్రయోగశాల:_*
అవునూ... 'బాబ్బాబు, మీకు ఓట్లేస్తాం' అని ఓటర్లు బతిమిలాడుతున్నా సరే.. 'ఎహె ఆగండి, అలా ఓట్లెలా వేస్తారు..? మా తన్నులాటలు ముందు తెగితే అప్పుడు ఆలోచిద్దాం' అన్నట్టుగా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకులు 'ఇప్పుడేం చేస్తారు..?' అనేది మరో ప్రశ్న. ఏమీ చేయరు, కొన్నాళ్లు సైలెంటు, మళ్లీ ఇదే కథ మొదలు. మరోవైపు చంద్రబాబు తనదైన శైలిలో రీఎంట్రీకి పావులు కదుపుతున్నాడు. ఈడీని ముందుపెట్టి బీజేపీ ఇంకాస్త హడావుడిని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. అది తెలంగాణపై ఆశల్ని ఎలాగూ వదులుకోదు. మొత్తానికి తెలంగాణ రాజకీయ ప్రయోగశాల అవుతోంది…!!

బాక్స్:
*_వీళ్ళంతా కంట్రిబ్యూటర్లే..!:_*
కేసీయార్‌ను కలిసినవారిలో… అసలు ఇప్పుడు ఉనికిలోనే లేని ఓ పత్రిక మాజీ కంట్రిబ్యూటర్ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చాడు ఆర్కే.! అదేదో అనర్హత అయినట్టు, రాజకీయాలకు కంట్రిబ్యూటర్లు అస్పృశ్యులు అయినట్టు…!! నిజానికి నాయకులను చూసీ చూసీ, రాజకీయాల్ని అర్థం చేసుకుంటూ నిజంగానే నాయకులుగా ఎదిగే చాన్స్ కంట్రిబ్యూటర్లకే ఉంది. అనేక చోట్ల వాళ్లు రాజకీయాల్లో ఎదుగుతున్నారు కూడా…! ఎదగాలి కూడా.! ఇప్పటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గతంలో జర్నలిస్టే.! దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కంట్రిబ్యూటరే.! అదే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి మొన్నటిదాకా జర్నలిస్టే కదా.! ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మొదట్లో కంట్రిబ్యూటరే.! చెబుతూ పోతే బోలెడు మంది.. ఉన్నారు సార్.!

బాక్స్:

*_ఏపీలో మీకేం పని..? -తాళ్ళూరి జీవన్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ_*

ఇది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు గురించి అవాకులు, చెవాకులు పెలుతున్న నాయకులు... కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో పనేమిటి.? రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను ఎన్ని తిట్లు తిట్టారో వీడియోలను బయటపెట్టమంటే బయటపెడతాం. నాడు తిట్టిన వాళ్ళు మళ్ళీ ఏ మొఖం పెట్టంకొని ఆంధ్రులను ఓట్లు అడగటానికి వెళతారు.? సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఇరిగేషన్ ప్రాధాన్యత గురించి చెప్పాలంపే అప్పటి చెక్ డ్యాంలను చేసుకోవాలి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీలో శాసనసభా నేతలుగా వ్యవహరించినప్పుడు వారు అడిగిన ప్రతి పని ఎన్టీయార్ చేసి పెట్టిన సందర్భాలు ఇప్పటి వారి వారసులు మర్చిపోతే ఎలా.? స్థాయిని బట్టి విమర్శలు చేయాలి గానీ.. ప్రతి గల్లీ లీడర్ స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించం. రాష్ట్రంలో హైదరాబాద్ ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిపిన చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అడిగే హక్కు ఉంది.

No comments:

Post a Comment