*తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలు*
*అనుకున్నదే జరిగింది.. తెలంగాణలోనూ మొదలైంది*
తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్ఫ్లూ మొదటి పాజిటివ్ కేసు నమోదైందని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు శనివారం నాడు ధృవీకరించారు.
దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పౌల్ట్రీ నుండి ఒక కిలోమీటరు పరిధిలో ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని డిపార్ట్మెంట్ అధికారులు పరిమితం చేశారు. కల్లింగ్ ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభించారు. గ్రామం, దాని చుట్టుపక్కల ప్రభావిత ప్రాంగణానికి ఒక కిలోమీటరు పరిధిలోని ఇతర పౌల్ట్రీలతో పాటు వ్యవసాయ క్షేత్రంలో బయో-సేఫ్టీ చర్యలు కూడా ప్రారంభించారు. బర్డ్ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు నేలపట్లలోని పౌల్ట్రీ ఫారాల్లో వచ్చే 15 రోజుల పాటు ఆంక్షలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కోళ్ల ఆకస్మిక మృతిపై సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యుల బృందం పాశం శివ అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫారమ్ను పరిశీలించి నమూనాలను సేకరించింది. వైద్యులు నమూనాలను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపారు.
*గంతల నాగరాజు రిపోర్టర్*
No comments:
Post a Comment