Monday, March 3, 2025

దేశ చరిత్రలో తొలిసారి #తెలంగాణ ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు

ఫిర్యాదు కన్నా ముందే ఎఫ్ఆర్ కేసులో 
సుప్రీంకోర్టు స్టే 

• దేశ చరిత్రలో తొలిసారి

• ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు

• తప్పించుకోలేక తప్పుడు కేసులు

• ఖమ్మం న్యాయస్థానంలో కొనసాగుతున్న న్యాయవిచారణ

* ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్ '

పుష్కరకాలంగా ఓ పాత్రికేయుడు పోలీసు శాఖ పొరపాటు చేసిందంటూ న్యాయస్థానంలో పోరాటం. కింద స్థాయిలో కేసు కొట్టివేత. చివరకు సుప్రీంకోర్టు 'స్టే' మంజూరు చేయడంతో ఓ ఊరట.

చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారులు న్యాయ వ్యవస్థను తన ఇష్టారాజ్యంగా వాడుకున్న అసాధారణ సంఘటనకు ఖమ్మం వేదిక అయింది. భారతదేశ న్యాయ చరిత్రలో ఓ అసాధారణ సంఘటన. పోలీసు వ్యవస్థకు ఈ అధికారుల కారణంగా తలవంపులు తెచ్చిన పరిస్థితి. నేరగాళ్లు వందమంది
తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే అత్యున్నత ఆశయంతో మనదేశంలోని ప్రతి న్యాయస్థానం సగర్వంగా నూట నలభై కోట్ల ప్రజానికానికి పెద్ద దిక్కుగా సేవలందిస్తోంది. సత్యం మాత్రమే పలకాలని జాతిపిత ఫొటో ప్రతి కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా పన్నులతో జీతాలు పొందుతున్నారని తెలుసు. పోస్టుమ్యాన్, డ్రైవర్లు, గుర్ఖాలు, అటవీ అధికారులు, పోలీసులు ఖాకీ రంగు దుస్తులలో ఇలా ప్రతినిత్యం ప్రజలకు సేవలందించే వారే. మరి ఒక్క పోలీసు మాత్రమే న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. రక్షణ కల్పించడానికి మాత్రమే పోలీసు ఉద్యోగి అహర్నిశలు కష్టపడే వారెందరో ఉన్నారు. ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. అందులోని నీచ, నికృష్టులకు చెంపదెబ్బ లాంటిది. న్యాయవ్యవస్థను వికృత అధికారులు ఎలా తప్పుదారి పట్టిస్తూ, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిది పక్కాగా చేశామని ధీమాతో అధికార దుర్వినియోగం. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా 'ఆదాబ్ హైదరాబాద్' మే 3, 2018నే స్పష్టంగా చెప్పింది.

అన్నీ ఇచ్చినా...:
ఆధారాలన్నీ ఇచ్చారు. 12ఏళ్ళ పాటు బాధితుడు అనేక ఆధారాలను సంపాదించాడు. అందులో వీడియోలు కూడా ఉండటం విశేషం. ఈ కథనంలోని ప్రతి అక్షరం లిఖితపూర్వక ఆధారాలతో అందిస్తున్నది.

అసలేం జరిగింది.?:
2013, ఆగస్టు15వ తేదీ.. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్... దేశం నెవ్వెరపోయే కుట్రకు తెర లేచింది. ఎఫ్.ఐ.ఆర్, ఇతర ప్రక్రియలకు రోజుల తరబడి చేసే పోలీసులు ఈకేసులో కేవలం 11 నిమిషాలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం గమనార్హం. ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు. జనరల్ డైరీలో ఎంట్రీ, వెంటనే ఎఫ్.ఐ.ఆర్. అ వెంటనే పంచనామాలు, విచారణ పూర్తి, ఖమ్మానికి 200 కి.మీ. దూరంలోని హైదరాబాద్ లోని నిదింతుని ఇంటకు ఉదయం 6.11 నిమిషాలకే చేరుకున్న పోలీసులు. ఇది ఎలా సాధ్యం..? అని అడిగితే వారు వచ్చిన ట్రాన్స్ ఫోర్ట్ లేఖను ముచ్చటగా మూడుసార్లు అందించారు. అందులోని కేసు వివరాలలోకి వెళితే అది పోలీసుల చేతులలో ముగిసిన కేసుగా తేలింది.

హైకోర్టు ఆదేశాలా.. అయితే ఏంటి..?:

ఈ కేసులో 'అన్ని చర్యలు ఆపుచేయాలని' రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అటు పోలీసుశాఖకు, ఇటు న్యాయశాఖకు అదే నెల 17న అందాయి. అయితే తాము చాలా.. చాలా గొప్పోళ్ళమని భావించే ఖాకీ ఉద్యోగి హైకోర్టు ఆదేశాలను 'త్రోసి రాజు' అంటూ 19వ తేదీన చార్జిషీట్ వేశారు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన న్యాయాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాము ప్రతిదీ ఖచ్చితంగా చేశామని లిఖితపూర్వకంగా రాసి మరీ వ్యవస్థలన్నింటినీ 12 ఏళ్ళుగా పోలీసులు పక్కాగా నమ్మించారు. ఈ విషయాలన్నీ నాటి సిఐ వెంకటేష్, ఈ కేసు విచారణ అధికార హోదాలో దృవీకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఏ.సి.పిగా ఖమ్మంజిల్లాలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాటి జిల్లా ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు అనేకసార్లు బాధితుడు చెప్పాడు. ఆయన
అరుపులు అరణ్య రోదనగా మిగిలింది. అంతా పోలీసులదే నిజమని నమ్మారు.


ఇలా జరగాలి:
'ఏ పోలీసు స్టేషనులో అయిన ఎఫ్.ఐ.ఆర్. అయితే 24 గంటలలోగా సంబంధిత న్యాయస్థానానికి ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి' అనే నిబంధన ఉంది. అన్యాయం తాత్కాలికంగా నిజమనే భ్రమలో ఉంచుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తోంది. అన్న చందాన బాధితుడు న్యాయశాఖలోని రికార్డులు సంపాదించాడు. ఫిర్యాదు ఆగస్టు 15, ఉదయం ఆరు గంటలకు అందగా వెంటనే ఎఫ్.ఐ.ఆర్. అయితే ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆగస్టు 16వ తేదీన న్యాయస్థానానికి ఆ ఎఫ్.ఐ.ఆర్ చేరాలి. కానీ ఆగస్టు 14వ తేదీన అవే సెక్షన్లు, అదే ఎఫ్.ఐ.ఆర్ అందినట్లు సంబంధి న్యాయాధికారి రిజిస్టర్ లో స్వయంగా సతంకం చేశారు. అంటే ఫిర్యాదు కన్న ఒకరోజు ముందే న్యాయస్థానానికి చేరింది. ఈ విషయాలపై కోర్టు ధిక్కారణ కేసు కూడ బాధితుడు ఆధారాలతో హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ విషయాలపై హైకోర్టులో వాదోపవాదాలు జరగగా... కేసును, కోర్టు ధిక్కారణ కేసును కలిపి హైకోర్టు కొట్టేసింది.

బాక్స్:
సుప్రీం 'స్టే':
హైకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ వాది అనంచిన్ని వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం జరిగిన వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను నిలుపు చేస్తూ ఆదేశాలను ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో అనంచిన్ని వెంకటేశ్వరరావు వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన ముంబై హైకోర్టు జస్టిస్ నాయుడు, లా టాపర్ విధి పంకజ్ ఠాకర్ (న్యూఢిల్లీ) వారిని తన తరఫున వాదనల కోసం ఎంచుకున్నారు.

Courtesy / Source by :
'ఆదాబ్ హైదరాబాద్' మీడియా 

No comments:

Post a Comment