Thursday, November 2, 2023

రాహుల్ గాంధీపై విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాహుల్ గాంధీపై విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కేటీఆర్ కామెంట్స్👇

తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ

కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.

వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారు.. మహా ఇంజనీర్లు వీళ్ళు బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు

ఎక్ష్పాన్షన్ జాయింట్ (#ExpansionJoint) ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన

రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ పార్టీ

రాహుల్ గాంధీకి చరిత్ర తెల్వదు, తెలుసుకునే సోయి లేదు.. స్క్రిప్ట్ అన్న మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో రాహుల్

కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం ఒక ధన యజ్ఞం.. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ గాడు మీ రేవంత్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు.. బ్లాక్‌మెయిలర్, నోటు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకున్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత

కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని దేశంలో ఎవ్వరిని అడిగిన చెప్తారు.. ఆదర్శ్, బోఫోర్స్, కామన్‌వెల్త్,, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు మీరు.

పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాలన్ని మింగిన అవినీతి తిమింగాలాలు మీరు

కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులు మీ పార్టీ వాళ్ళు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టారు

పార్టీ పేపర్ నేషనల్ హెరాల్డ్‌లో కూడా అవినీతికి పాల్పడి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న మీరు నీతి, నిజాయితీ అంటే జనం నవ్వుకుంటున్నారు

కాళేశ్వరం గురించి మీ పక్కన ఉన్న సన్నాసులు చెప్పిన సొల్లు కాకుండా అసలు విషయాలు తెలుసుకోవాలి. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది రూ. 80 వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఎక్కడ?

మీరు 2008 లో వేసిన ప్రాణహిత అంచనా రూ. 40 వేల కోట్లు అందులో రిజర్వాయర్లు లేవు. కాలువలకు, పంపు హౌసులకు అంత పెట్టారు.. 15 ఏళ్ల తర్వాత అంచనాలు పెరగవా?

మీ హయాంలో మానకొండూరులో సాగునీరు లేక SRSP కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్ళం

ప్రాణహిత నదిలో నీటి లభ్యత తక్కువ ఉందని ఎలాంటి కరువు వచ్చిన తెలంగాణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. ప్రాణహిత, గోదావరి కలిసే ప్రాంతంలో. కేసీఆర్ మేడిగడ్డకు అంకురార్పణ చేశారు

తమ్మిడిహట్టి నుంచి నుంచి నీరు ఎల్లంపల్లికి వచ్చే బదులు ఎక్కువ నీటిని మేడిగడ్డనుంచి తెచ్చే విదంగా ప్రాజెక్టు రూపొందించారు. 

50 టీఎంసీల మల్లన్న సాగర్, 3 టీఎంసీల రంగనాయక్ సాగర్, 12 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఇంకా గంధమల్ల ఇలా అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, భారీ పంపు హౌస్లు నిర్మించారు 

సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల ఇలా దాదాపు 10 కొత్త జలాశయాలు నిర్మించడం వల్ల ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ధాన్యగారంగా తయారైంది.
Courtesy / Source by :
Mission Telangana
@MissionTG
https://twitter.com/MissionTG/status/1720049295976804778?t=GVTy5tsK1YiY_0gE0L6V3w&s=19

No comments:

Post a Comment