Thursday, November 30, 2023

ఓటు హక్కును వినియోగించుకున్న 93 ఏళ్ల లక్ష్మయ్య.

ఓటు హక్కును వినియోగించుకున్న 93 ఏళ్ల లక్ష్మయ్య..
రామంతపూర్. ఓటు వేయడానికి బద్దకిస్తున్న కొంతమంది యువత కు స్ఫూర్తినిస్తున్న   మేడ్చల్ జిల్లా, GHMC ఉప్పల్ సర్కిల్ , ఉప్పల్ అసెంబ్లీ  నియోజకవర్గం రామంతాపూర్  నెహ్రూనగర్ కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి 93 ఏళ్ల వయసుగల ముత్తినేని లక్ష్మయ్య ఉత్సాహంగా రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు.
ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించు కుంటున్నానన్నారు.
ఓటు వేయడానికి బద్దకిస్తున్న యువత లక్ష్మయ్య ను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment