Tuesday, November 7, 2023

దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాలని టీఎన్జీవో విజ్ఞప్తి

పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి

 

దీపావళి పండుగ పురసరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాలని విజ్ఞప్తి చేసింది.

 

  • 13న దీపావళి సెలవు ప్రకటించాలి
  • సీఎస్‌ శాంతికుమారికి టీఎన్జీవో వినతి

హైదరాబాద్‌, నవంబర్‌ 7 (నమస్తే తెలంగాణ) : దీపావళి పండుగ పురసరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు టీఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారం జగదీశ్వర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎస్‌ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేసింది. సీఎస్‌ను కలిసినవారిలో సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు కస్తూరి వెంకట్‌, కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేని, నగరశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్‌, మహేశ్‌, గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment