Friday, August 4, 2023

ప్రధాని మోదీనీ కలిసిన... MP కోమటి రెడ్డి....!

*ప్రధాని మోదీనీ కలిసిన... MP కోమటి రెడ్డి....!*

ఢిల్లీ...ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని గురునానక్‌ యూనివర్శిటీ, శ్రీనిధి యూనివర్శిటీలపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.ఆ రెండు యూనివర్శిటీలకు హోదా లేకున్న లక్షల్లో ఫీజులు వసూలు చేశారని, దీనిపై వెంటనే ఈడీ, సీబీఐలతో ఫిర్యాదు చేయించాలని వెంకట్‌రెడ్డి కోరారు. NH 65లో మల్కాపూర్ నుండి విజయవాడ వరకు 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment