Saturday, August 26, 2023

మైనంపల్లి ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు....!

*మైనంపల్లి ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు....!*

హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్‌ను భారాస నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించనున్నట్లు సమాచారం. కాసేపట్లో కార్యకర్తలతో మాట్లాడనున్నారు. ఆయన నివాసానికి కాంగ్రెస్ నాయకులు కూడా వస్తున్నారు. ఇప్పటి వరకైతే హనుమంతరావు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మైనంపల్లి నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment