Saturday, April 22, 2023

ఒట్టేసే అవసరం నాకు లేదు.... రేవంత్ సవాల్ పై స్పందించిన ఈటల

*ఒట్టేసే అవసరం నాకు లేదు.... రేవంత్ సవాల్ పై స్పందించిన ఈటల*

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపరచలేదన్నారు.తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందని.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని చెప్పారు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని స్పష్టం చేశారు. దీనిపై తగిన సమయంలో జవాబిస్తానని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారాస భారీగా డబ్బు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు.మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు భారాస డబ్బులు పంపిందని భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. భారాస నుంచి, సీఎం కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదన్నారు. ఈ వ్యవహారంపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై తాజాగా రేవంత్‌ ప్రమాణం చేశారు. ''అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశాను. దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను ఉపసంహరించుకోవాలి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. తాను విసిరిన సవాల్‌ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశాను. ఈటల తన ఆరోపణలను నిరూపించుకోవాలి'' అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారం తాజాగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment