Monday, April 17, 2023

మాజీ విలేకరిని కిడ్నాప్‌ చేసి చంపేశారు.

*దారుణం..*
*_మాజీ విలేకరిని కిడ్నాప్‌ చేసి చంపేశారు.._*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_కిడ్నాప్‌కు గురైన మాజీ విలేకరి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.._* మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ (29) ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. కొద్దినెలల క్రితమే మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు.

*_కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్‌ చేసి.._*
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వస్తుండగా మార్గంమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుడిని కిడ్నాప్‌కు గురైన కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

*_ప్రజాప్రతినిధితో విభేదాలే కారణమా?_*
కొత్తూరు మండల స్థాయి ప్రజాప్రతినిధి, కరుణాకర్‌రెడ్డిది ఒకే ఊరు. ప్రజా ప్రతినిధి వద్ద ప్రధాన అనుచరుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి.. విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగి కేసులు కూడా నమోదయ్యాయి.  సదరు ప్రజాప్రతినిధి అనుచరులు, సొంత తమ్ముళ్లే.. కరుణాకర్ రెడ్డిని అపహరించి దారుణంగా హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. కిడ్నాప్‌ జరిగినప్పటి నుంచి ప్రజాప్రతినిధి, అతడి అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

No comments:

Post a Comment