Tuesday, April 11, 2023

తలవంచడం కాదు.... జనమే సర్కార్ మెడలు వంచుతారు.... జూపల్లి....!

*తలవంచడం కాదు.... జనమే సర్కార్ మెడలు వంచుతారు.... జూపల్లి....!*

మహబూబ్‌నగర్‌: తనకు కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని.. తప్పు చేసినప్పుడు స్వపక్షమైనా ప్రశ్నించే బాధ్యత ఉంటుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. మూడేళ్ల నుంచి తనకు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వలేదని.. పార్టీ బాధ్యతలే ఇవ్వకుండా సస్పెండ్‌ చేశామని ఎలా అంటారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడారు.

''తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతను నేను. తెలంగాణ వద్దన్న నేత వద్దకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలా? ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించాను. నా సహకారం వల్లే రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయి. కేసులతో నా అనుచరులను ఇబ్బంది పెట్టారు. మంత్రి కేటీఆర్‌ సహా అందరికీ సమస్యలు వివరించాను. నాపై ఎన్ని దాడులు జరిగినా ఏ ఒక్కరిపైనా కేసులు పెట్టలేదు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా కేసులు పెడుతున్నారు. తలవంచడం కాదు.. జనమే సర్కారు మెడలు వంచుతారు'' అని జూపల్లి వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment