Sunday, September 25, 2022

నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్

*నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్*

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీకి సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వస్తున్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా రానున్నారు.ఇటీవలే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో మంత్రి కేటీఆర్‌ బాసర రానున్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. కాగా, ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్‌లో విద్యార్థులు ఆందోళకు దిగిన విషయం తెలిసిందే. ట్రిపుల్‌ ఐటీకి ముఖ్యమంత్రి లేదంటే మంత్రి కేటీఆర్‌ రావాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పర్యటన ప్రాధాన్యం సంత రించుకుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment