Tuesday, September 6, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!

*ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!*

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.దిల్లీ, ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌, లఖ్‌నవూ తదితర నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రేమ్‌సాగర్‌, అభిషేక్‌రావు, సృజన్‌రెడ్డి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇంట్లో సోదాలు నిర్వహించడం లేదని ఈడీ అధికారులు తెలిపారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment