Monday, September 30, 2024

*మూసీ సుందరీకరణ...హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన....!*

*మూసీ సుందరీకరణ...హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన....!*

హైదరాబాద్‌: మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్నవారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్నారు.నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్‌ చేయడం లేదని, మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టని చెప్పారు. దానిని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతోందని వెల్లడించారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

No comments:

Post a Comment