Tuesday, September 10, 2024

*సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి*

*సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి*

Sep 10, 2024

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదన్నారు. ఈ పరంపరను బ్రేక్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విలీన దినోత్సవం అధికారికంగా జరపాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే వ్యవహారంపై న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు విచారణ జరపాలన్నారు. వారి వెనుక ఎవరున్నారని దానిపై విచారణ చేపట్టాలని అన్నారు.

Courtesy / Source by :
*గంతల నాగరాజు రిపోర్టర్*

No comments:

Post a Comment