Tuesday, October 31, 2023

ఒకరిద్దరు వెళ్ళిపోయినా...టీడీపీ కీ నష్టం లేదు.... బక్కని నర్సింలు

*ఒకరిద్దరు వెళ్ళిపోయినా...టీడీపీ కీ నష్టం లేదు.... బక్కని నర్సింలు*

*కాసాని రాజీనామా, వ్యాఖ్యల్ని తప్పుబట్టిన నేతలు...!*

హైదరాబాద్‌: తెదేపాకు కార్యకర్తలే బలం, బలగమని.. ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన బలహీనపడదని ఆ పార్టీ నాయకులు స్పష్టంచేశారు.తెదేపా ముఖ్యనేతలు మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింలు మాట్లాడుతూ.. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా, కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లారంటూ కాసాని జ్ఞానేశ్వర్‌పై మండిపడ్డారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారనీ..పార్టీ రాష్ట్ర కమిటీలన్నింటినీ రద్దుచేశారన్నారు.

కొందరు వ్యక్తుల కోసం పార్టీ నిర్ణయాలు ఉండవని పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మాట్లాడుతూ కాసాని అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వలేదని ఆక్షేపించారు. జాతీయ నాయకత్వం కోర్‌కమిటీ వేస్తే కాసాని సహకరించలేదని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. 

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment