Monday, October 2, 2023

హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల.... దీక్ష

*హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల.... దీక్ష*

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షలో ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్‌, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్‌ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్‌, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు దీక్షకు కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెదేపా నేతల దీక్ష కొనసాగనుంది.

మరోవైపు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దీక్ష చేపట్టారు. ఆమెతో పాటు కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment