Wednesday, October 11, 2023

మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున....?

*మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున....?*

హైదరాబాద్:మొదటి నుంచీ ఈటల కుటుంబానికి మేడ్చల్‌ నియోజకవర్గానికి సమీప సంబంధాలు ఉండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మేడ్చల్‌ నుంచి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సతీమణి జమునను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఈటల రాజేందర్‌ మేడ్చల్‌ మండల పరిధిలోని పూడూర్‌ దగ్గర ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో నివాసముంటున్నారు.

ఆయన గోదాంలు, గతంలో పౌల్ట్రీలు, ఇతర వ్యాపారాలు నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో వారి కుటుంబానికి మేడ్చల్‌కు చాలా రోజులుగా సత్సంబంధాలు ఉన్నాయి. జమున నివాసం పూడూర్‌ పరిధిలో ఉండటంతో పాటు స్థానిక నాయకులతో పరిచయాలు ఉన్నాయి.ఈటలకు అర్థ బలం పరిపుష్టిగా ఉండటం, టికెట్‌ ఆశిస్తున్న మిగతావారికి ఆ బలం లేకపోవడం, రాజేందర్‌ బీసీ అయినా జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఆ సామాజికవర్గ పెత్తనం మేడ్చల్‌లో ఎక్కువగా ఉండటంతో ఆమె అభ్యర్థిత్వం తమకు కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ మేడ్చల్‌ టికెట్‌ తన భార్య జమునకు కేటాయించాలని ఎమ్మెల్యే ఈటల రాజెందర్‌ అధిష్టానాన్ని కోరినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment