Tuesday, October 31, 2023

BRS అభ్యర్థులకు.... భద్రత పెంపు....!

*BRS అభ్యర్థులకు.... భద్రత పెంపు....!*

హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది.ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment