Tuesday, November 30, 2021

సూర్య ‘జై భీమ్’ కు అరుదైన గౌరవం

సూర్య ‘జై భీమ్’ కు అరుదైన గౌరవం

జ్ఞానవేల్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై భీమ్. డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. నిజజీవితంలో జరిగిన ఓ లాకప్ డెత్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కు సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు వరకు అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు.

అయితే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు ను సాధించింది. ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. వచ్చే ఏడాది లాస్ లాస్ ఏంజిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ 2022 అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వినూత్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ డ్రామా మూవీ కూషంగళ్ కూడా నామినేట్ అయింది.

No comments:

Post a Comment