Wednesday, November 10, 2021

మేడ్చల్ మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి పట్టివేత

మేడ్చల్ మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి పట్టివేత

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

తెలంగాణ లో గంజాయి వాడకం పెరుగుతుంది. ఎక్కడికక్కడే పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయిని పట్టుబడింది. రెండు కార్లలో గంజాయి తరలిస్తున్న 450 కిలోల గంజాయిని మల్కాజ్ గిరి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ పట్టుబడ్డ గంజాయి విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని తెలుస్తోంది. మొత్తం రెండు కారులు, గంజాయి తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. కాగా ఈ గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment