Friday, November 19, 2021

నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

– ఫినిక్స్ భూఫిక్సింగ్ కి ఎప్పుడో స్కెచ్
– 90వ దశకంలోనే కన్నేసిన పచ్చబ్యాచ్
– ఆనాడు పదిలక్షలకే పందేరాలు
– నేడు పదివేల కోట్లు..గులాబీలు వదిలేస్తారా!
– ధరణి ప్రకారం 137 ఎకరాలు సర్కార్ దే!
– తొలివెలుగు పరిశోధనాత్మక కథనం

అది 90వ దశకం.చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు.హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేశారు.గుట్టలను తవ్వుకుంటూ రోడ్లు వేస్తున్నారు.గుట్టల్లో దండిగా ప్రభుత్వభూమి,అసైన్డ్ ల్యాండ్.ఎవ్వరికి దొచినంత, చూసినంత భూమి తమదే అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు.ఆ కాలంలో చెప్పాలంటే సైబర్ టవర్ కి చాలా దూరంగానే..సర్వే నెంబర్స్35,37,40,42 నుంచి 47 మరియు 53తో పాటు ఇంకా ప్రభుత్వ భూమి ఉంది.

మహాదేవి కో-ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ మాయాజాలం


ఈ ప్రభుత్వ భూమిని దక్కించుకోవాలనే ఉపాయంతో మహాదేవి కో-అపరేటివ్ సొసైటి తెరపైకి వచ్చింది.డాక్యుమెంట్ నెంబర్లు 1564/1996 నుంచి 1585/1996 వరకు ఒకే రోజున రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖానామెట్ శివయ్యతో పాటు మరో 46మంది దళితుల కుటుంబాల నుంచి వేణుగోపాల్ రెడ్డి,తరుణ్ జోషీల పేర్ల మీద మహాదేవి కో-అపరేటివ్ హౌజింగ్ సొసైటికి 20 రిజిస్ట్రేషన్స్ చేయించారు.అయితే అందులో భూమి విస్తరణ ఎంత, హద్దులు ఎవరెవరివి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.వారికి ఉన్నభూమిని అమ్మినట్లు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. 1998లో 5ఎకరాల 13 గుంటల భూమిని విస్తరణతో పాటు రిజిస్ట్రేషన్ హద్దులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ మరోసారి చేయించుకున్నారు.ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ దళితులు మరికొంత మందికి ఎకరాల చొప్పున అమ్మకం జరిపారు.ఇక సొసైటీ రూల్స్ పాటించకపోవడమా..లేదా ప్రభుత్వ భూమి అని తెలిసో కాని మహాదేవి కో-ఆపరేటీవ్ హౌజింగ్ సొసైటీ కాస్తా ప్రయివేట్ లిమిటెడ్ గా మారిపోయింది.820/1999నుంచి 837/1999 వరకు మళ్లీ రిజిస్ట్రేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపనీకి చేశారు.


కష్టోపా కార్పోరేషన్ కి సర్వె నెంబర్ 35,36

గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో కష్టోపా కార్పోరేషన్ విచ్చలవిడి అమ్మకాలు జరిపింది.సర్వే నెంబర్ 35లో అనిల్ కుమార్ కామ్ దార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నసమయంలోఎస్.పటేల్,రూసెన్ పటేల్,పి.ఏ.పటేల్,రూపన్ పటేల్,సోనాల్ పటేల్స్ కి అమ్మకం జరిపారు.సర్వేనెంబర్ 36లో వివిధ బిజినెస్ పీపుల్ కి అమ్మకం జరిపారు.ఆ బిజినెస్ పీపుల్ అటు టీడీపీలోను,ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోను చక్రం తిప్పిన వారే..అర్బన్ సిలింగ్ యాక్ట్ ప్రకారం మిగులుభూమి అంతా ప్రభుత్వ భూమి అని 1971 నుంచి రికార్డుల్లో ఉంది.కాని వివిధ సొసైటీ పేర్ల మీదుగా,ప్రయివేట్ లిమిటెడ్ కంపనీలకు,బిజినెస్ పీపుల్ చేతిలోకి రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇదంతా అప్పటి నాయకులు 10 లక్షలు పంచుకుని రిజిస్ట్రేషన్స్ చేయించారని ఆరోపణలు.

ప్రభుత్వ భూమిలో మరిన్ని సొసైటీల బాగోతాలు

సాయి అశ్వికా ప్రాపర్టీస్,సాయి నిహారిక ప్రాపర్టీస్,సాయి అనన్య ప్రాపర్టీస్,కృష్ణార్జున ప్రాపర్టీస్ పేర్లతో ప్రభుత్వభూముల్లో ప్లాట్స్ చేసి అమ్ముకున్నారు.విక్రయించిన ప్లాట్స్ ఏమయ్యాయి.కోర్టుల్లో కేసులు ఏంటి.. చివరికి ఎవరికి చేరాయి.రికార్డుల్లో తన పేరుతో సహా ఉండి..చక్రం తిప్పిన ఏ.పి.మంత్రి ఎవరు..?పచ్చపార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలా భూములు వచ్చాయి.ఆ తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి నేతలతో గులాబీ నేతల దోస్తానం ఎవరికి కలిసి వచ్చిందో పార్ట్ -3 లో ఇన్వెస్టిగేషన్ కథనంలో చూద్దాం.

Video Player
00:00

No comments:

Post a Comment