Wednesday, November 24, 2021

ఆర్టీసీ చైర్మన్‌గా జీతం వద్దు బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

ఆర్టీసీ చైర్మన్‌గా జీతం వద్దు బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. బుధవారం లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి ఇచ్చారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై అదనపు ఆర్థికభారం మోపడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శాసనసభ్యుడిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలు అని బాజిరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌ నిర్ణయంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ పున్న హరికిషన్‌ బాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్‌ ను స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీ అధికారులు కూడా అలవెన్స్‌ల విషయంలో కొన్ని త్యాగాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment