Sunday, May 31, 2020

తెలంగాణ లాక్ డౌన్ వార్తలు

లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సిఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయించారు.

కంటైన్మెంట్ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులకు అనుమతివ్వాలని, కటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాలకు రాకపోకల విషయంలో కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు.
#COVID 19

గ్రూప్ link Media 
@TelanganaCMO సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020.
5:00pm 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment