Friday, March 17, 2023

స్వప్నలోక్ ఘటన పై కేసీఆర్ దిగ్భ్రాంతి.... ఎక్స్ గ్రేషియా ప్రకటన

*స్వప్నలోక్ ఘటన పై కేసీఆర్ దిగ్భ్రాంతి.... ఎక్స్ గ్రేషియా ప్రకటన*

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (Exgratia)ను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కు సీఎం కేసీఆర్  సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment