Friday, July 15, 2022

గోదావరి ఉగ్రరూపం..... భద్రాచలానికి ఇండియన్ ఆర్మీ

*గోదావరి ఉగ్రరూపం..... భద్రాచలానికి ఇండియన్ ఆర్మీ*

హైదరాబాద్‌: గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తుండటంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో సహాయ చర్యలు అందించేందుకు ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలం బయలుదేరింది.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment