Saturday, July 2, 2022

విశ్వబ్రాహ్మణుల ను కించపరిచేలా మాట్లాడలేదు, : మంత్రి కేటీఆర్

*విశ్వబ్రాహ్మణుల ను  కించపరిచేలా మాట్లాడలేదు, : మంత్రి కేటీఆర్*

హైదరాబాద్ : విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్న వార్తలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారుమొన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా.. విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలే కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కులాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు అని తేల్చిచెప్పారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment