Monday, July 18, 2022

దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు....భవిష్యవాణి లో స్వర్ణలత......!

*దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు....భవిష్యవాణి లో స్వర్ణలత......!*

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా 'రంగం' కార్యక్రమం నిర్వహించారు.జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

''పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. ఎంత సంతోషంగా చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు.

గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. కడుపులో పెట్టుకుంటున్నా. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా! దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు'' అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment