Tuesday, July 5, 2022

సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష.... విద్యా సంస్కరణలపై చర్చ

*సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష.... విద్యా సంస్కరణలపై చర్చ*

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. మంగళవారం సాయంత్రం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.గురుకులాలను ఇంటర్ స్థాయికి ఉన్నతీకరించడంపై ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను.. ఉపాధి శిక్షణా కేంద్రాలుగా మార్చే అంశంపైనా చర్చ కోసం ఈ సమావేశం నిర్వహించారు.

నాణ్యమైన విద్యను అందించడం, సంక్షేమ అంశాలపై చర్చ ప్రధానాంశాలుగా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment