Wednesday, June 10, 2020

తెలంగాణ డీజీపీ సూచనలు

హైదరాబాద్  : 10/06/2020

*కరోనా వ్యాప్తిచెందకుండా పోలీస్ శాఖలో ముందస్తు జాగ్రతలు **

రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది తెలంగాణలో. 
కేసుల సంఖ్య పెరుగుతుంది. 
దీంతో పోలీస్ శాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పోలీస్ శాఖలో అనారోగ్యంగా ఉన్న సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. 
ఈ విషయం పై సీపీ లు, ఎస్పీ లకు ఉత్తర్వులు జారీ చేసారు. 
పోలీస్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు వుంటే క్వారంటైన్ లో ఉండాలని డీజీపీ సూచించారు. ఇతరులకు వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు. 

గ్రూప్ link Media *ప్రజల పక్షం ** సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment