Thursday, June 18, 2020

తెలంగాణ ఇంటర్మీడియట్ లో అగ్రగామి

హైదరాబాద్ : 19/06/2020

*ఇడ్లీల విక్రేత కుమార్తె ఇంటర్‌లో టాపర్‌*

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: *పట్టుదల ఉంటే చదువులో రాణించేందుకు పేదరికం అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని కల్యాణి.*  ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి అగ్రగామిగా నిలిచింది. తల్లిదండ్రులు ఇంటి వద్ద ఇడ్లీలు తయారు చేసి ఇంటింటా తిరిగి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానిక ద్వారకానగర్‌ నివాసి కాటే శేషగిరి-అనిత దంపతుల చిన్నకూతురు కల్యాణి. ‘మేధా ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆ ట్రస్ట్‌ ఆధ్వర్యాన హైదరాబాద్‌ శ్రీచైతన్య కళాశాలలో చేరి ఎంపీసీ చదివింది. 992 మార్కులు సాధించింది. ఐఐటీ మెయిన్స్‌లోనూ 97 మార్కులు పొందింది.

*మంచి సంకల్పం తో, పట్టుదలతో కష్టపడి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో అగ్రగ్రామిగా నిలిచినందుకు ప్రజా సంకల్పం  గ్రూప్ తరపున అభినందనలు తెలుపుతున్నాను 👍*

గ్రూప్ link Media 
ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment