Wednesday, June 14, 2023

చెరువుల ఆక్రమణలపై తుది నివేదిక సమర్పించండి : హైకోర్టు

చెరువుల ఆక్రమణలపై తుది నివేదిక సమర్పించండి : హైకోర్టు
Courtesy by : ABN , First Publish Date - 2023-06-14T05:49:02+05:30 IST

రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెరువుల రక్షణకు సంబంధించి తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెరువుల రక్షణకు సంబంధించి తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆయా చెరువుల భూములపై సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్‌ హద్దులు గుర్తించాలని గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్లలో ప్రభుత్వం కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే సమర్పించిందని తుది నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.

No comments:

Post a Comment