Wednesday, June 14, 2023

సర్కార్ వైద్యం బాగుంటే.... పంటి నొప్పికే సీఎం ఢిల్లీకి ఎందుకు.... బూర నర్సయ్య గౌడ్!

సర్కార్ వైద్యం బాగుంటే.... పంటి నొప్పికే సీఎం ఢిల్లీకి ఎందుకు.... బూర నర్సయ్య గౌడ్!

*హైదరాబాద్...*
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం వెలుగులు జిమ్మితే పంటి, కంటి నొప్పికి సీఎం కేసీఆర్‌ దిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మాజీ ఎంపీ, భాజపా సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్‌ ప్రశ్నించారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచి నుంచి సీఎం వరకూ.. ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. 56శాతం డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు.

''రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడంలేదు. కేసీఆర్‌ కిట్స్‌, న్యూట్రీషియన్‌ కిట్‌ నిధులు కేంద్ర ప్రభుత్వానివే. వరంగల్‌, నిమ్స్‌ ఆసుపత్రుల కోసం భూములను కుదువ పెట్టారు. తెలంగాణ స్టేట్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి భూములు కుదువపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది'' అని బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment