Sunday, March 21, 2021

ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న మాట


హైదరాబాద్ : 21/03/2021

*ప్రగతిభవన్ గోడలు పగలగొడుతా...  తీన్మార్ మల్లన్న...!*

నల్గొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'వంద కోట్లు.. దొంగనోట్లు' ఈ ప్రయత్నం ద్వారా ప్రజల గొంతుకను చట్టసభకు రాకుండా అడ్డుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. బరాబర్ వస్తా.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే రోజు తీసుకువస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిన విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తానే అనేక అక్రమాలను బయటపెట్టానన్నారు. దాన్ని సాకుగా చూపించదలచుకోలేదని, కానీ ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సరైన గుణపాఠాన్ని ప్రభుత్వానికి తెలిపారన్నారు. అయితే ఎంత అధికార ఒత్తిడి జరిగినా చివరి క్షణం వరకు పోరాడామని, పోరాడుతునే ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

*link Media SVL🖋️*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment