Saturday, November 7, 2020

GHMC ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ కాలనీ స్థానిక మహిళల నిరసన


https://youtu.be/EUO5mWjY564
07/11/2020

*పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.GHMC రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ కాలనీ లో GO RT 525 నిబంధనల ప్రకారం వరద నష్టపరిహారం విచారణ చేయకుండా అర్హులైన వారికి ఇవ్వలేదు దానితో స్థానిక మహిళలు రాస్తారోకో చేయడం జరిగింది*

బాపట్ల కృష్ణమోహన్ 
prajasankalpam1@gmail.com

https://prajasankalpam1.blogspot.com/
హైదరాబాద్ : 07/11/2020
 
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *GHMC రామంతాపూర్ 9వ  డివిజన్ భరత్ నగర్* లో గత నెలలో కురిసిన వర్షాలకు వారం రోజులు దాదాపు 100 నివాసాలు వాటిలోని కిరాయిదారులు చాలా ఇబ్బందులకు గురిఅయ్యారు.ప్రభుత్వం *GO RT 525* ద్వారా అర్హులైన వారికి వరద నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దానికి GHMC ఉప్పల్ సర్కిల్ అధికారులు భరత్ నగర్ కాలనీ కు నర్సింగ్ రావు అనే అధికారిని నియమించింది. దానికి ఆ అధికారి వరద ప్రవాహం ఎక్కడ అయితే వారం రోజులుగా ప్రవహించిందో అక్కడి ప్రజలను విచారణ చేయకుండా  ఎవరో చెప్పిన వారి మాటలు విని *అర్హులైన* వారికి ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చి వెళ్లారు.ఎన్నో *అవకతవకలు* జరిగాయి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఆపేసింది. ఆ తరువాత జరిగిన *ప్రజా ఉద్యమం* తరువాత ప్రభుత్వం మళ్ళీ రెండవ విడత  వరద నష్టపరిహారం ఇవ్వడం మొదలు పెట్టారు.అయితే భరత్ నగర్ కాలనీ పేరు *లిస్ట్* లో వున్నా అధికారులు రావడం లేదు. దానిలోభాగంగా రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ లోని ఇంతకుముందు *అర్హులైన వారికి ఇవ్వలేదో వారికి ఇవ్వాలని స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ధర్నా & రాస్తారోకో చేయడం జరిగింది.ఈ పోరాటం లో స్థానిక నివాసం ఉంటున్న *మహిళలు అందరు కలిసి ఐక్యమత్యంగా కలిసి పోరాటం చేయడంను చూసి ప్రజా ప్రతినిధులు చాలా నేర్చుకోవాలి*. 

*అధికారులను ఫోన్ లో సంప్రదిస్తే సరిగా స్పందించలేదు. ఈ సమస్య పరిష్కారం చేయవలసిన  బాధ్యత పూర్తిగా ఉప్పల్ GHMC డిప్యుటీ కమీషనర్ అరుణ కుమారి మేడం గారిదే*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment