Monday, November 9, 2020

కేటీఆర్ సర్ రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూముల ప్రజలకు న్యాయం చేయగలరు


హైదరాబాద్ : 10/10/2020

మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూముల* విషయంలో గత రెండు రోజులుగా *ఉప్పల్ MLA గారు & రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ మేడం గారు మరియు తెరాస నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు ఫోటో కు పాలాభిషేకం చేశారు...* అలాగే నిన్న (09/11/2020) మంత్రివర్యులు *కేటీఆర్ సర్ గారిని ప్రగతి భవన్ లో కలిశారు*. అయితే కేటీఆర్ సర్ గారు *ట్విట్టర్ లో ఎక్కడ కూడా రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములను ప్రస్తావించలేదు అంటే ఏమని  అర్ధం చేసుకోవాలి ???*

----------------------------------------
కేటీఆర్ సర్ గారి మంత్రిత్వశాఖ ట్విట్టర్ లో ఏమన్నారు అంటే *ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు స్థానిక ఎమ్మెల్యే @bethisubhastrs తో కలిసి ప్రగతి భవన్ లో మంత్రి @KTRTRS ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఆయా కాలనీ వాసులు*
----------------------------------------

*రామంతాపూర్ డివిజన్ బగాయత్ భూములలో నివాసం ఉంటున్న ప్రజలారా మీకు GHMC ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మీకు న్యాయంగా భూమి హక్కులు మీకు అధికారికంగా ప్రభుత్వం ఇస్తేనే మీకు శాశ్వతపరిష్కారం జరిగినట్లు... అప్పుడు మీరు కేటీఆర్ & కేసీఆర్ సార్ల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి అభినందనలు తెలపాలి*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment