Tuesday, November 10, 2020

ప్రశ్నించే గొంతు గెలిచింది

హైదరాబాద్ : 11/11/2020

*ప్రశ్నించే గొంతు గెలిచింది*

అవును ఇది అక్షరాలా నిజం అని దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలియచేశాయి. *రఘునందన్ రావు అనే ప్రశ్నించే గొంతు* వెనకాల ఎంతో *శ్రమ* వుంది. ఇలాంటి గొంతు లు ఇప్పుడు రాబోయే *GHMC & పట్టభద్రుల ఎన్నికలలో గెలుపు సాదించాలి* అని ప్రజా సంకల్పం & link Media సంకల్పిస్తుంది. 

*ఈ సందర్బంగా కొన్ని  ముఖ్యమైన వాస్తవాలు మీ అందరికి తెలియచేయాలి. దుబ్బాక ఉపఎన్నికలలో ప్రజా సంకల్పం & link Media మరియు ప్రజాసంఘాలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా  కీలక పాత్ర పోషించాయి దుబ్బాక నియోజకవర్గం ప్రజలను జాగృతం చేయడంలో. రాజకీయ పార్టీ లకు ఓటు వేసేటప్పుడు పార్టీ అభ్యర్థిని చూడాలి అలాగే అతను ప్రజలకోసం ఏ విధంగా అందుబాటులో వుంటూ నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలకోసం మంచి సంకల్పంతో ప్రజల అభివృద్ధి లో పాలు పంచుకుంటారో వారినే ఎన్నుకోవడం ఉత్తమం అని తండాల నుంచి మొదలు పెడితే మండలం వరకు ప్రజలందరిని జాగృతం చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా అక్కడ కూడా ఓటరు మహాశయులను జాగృతం చేస్తున్నారు.* 

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు దుబ్బాక ఎన్నికల సందర్బంగా సోషల్ మీడియా మీద & ప్రజా సంఘాల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు దానికి ఫలితం చూసాడు... ముఖ్యమంత్రి సారు ప్రజా సంఘాలు డబ్బులకోసం పనిచేయవు నిస్వార్థం ప్రజలను జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మీరు తెలంగాణ ఉద్యమం లో వున్నప్పుడు ఇవే ప్రజా సంఘాలు మీకు ఆదరించాయి అది మరిచిపోకూడదు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment