Monday, November 23, 2020

హైదరాబాద్ ఓటర్లకు ఎన్నికల కమీషనర్ ఓ విజ్ఞప్తి చేసారు

హైదరాబాద్ : 23/11/2020

*హైదరాబాద్ ఓటర్లకు ఎన్నికల కమీషనర్ ఓ విజ్ఞప్తి చేసారు*
 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థ సారథి. ఓటు మన హక్కు మాత్రమే కాదు .... బాధ్యత కూడా.. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోండి. కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ఓటేయండి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయండి. యువత, విద్యాధికులు తప్పనిసరిగా ఓటింగులో పాల్గొని ఓటింగ్ శాతం పెంచండి. కోవిడ్ పేషంట్ లు, వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం, వినియోగించుకొని ఓటేయండి. వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేసాం ఉపయోగించుకొని ఓటేయండి.

వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, నిర్భయంగా ఓటు వేయండి. డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచండి అన్నారు.

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment