Friday, November 6, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 07/11/2020

*తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 44,644 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,607 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,372కి చేరింది. కరోనాబారి నిన్న 937 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,27,583కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,134 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 45,75,797కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment