Saturday, November 28, 2020

GHMC ఎన్నికలు - 2020 లో భాగంగా కేంద్రమంత్రి అమితాషా హైదరాబాద్ పర్యటన

హైదరాబాద్ : 29/11/2020

*భాగ్యలక్ష్మి ఆలయం లో అమిత్ షా పూజలు.......!*

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్‌ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు ఉన్నారు.
కాసేపట్లో వారాసిగూడ చేరుకుని అక్కడి చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ సీతాఫల్‌మండీ వరకు 1.3 కిలోమీటర్ల దూరం రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.
అక్కడే భోజనం చేసి, పార్టీ ముఖ్య నేతలతో బల్దియా ఎన్నికలపై సమీక్షిస్తారు. సాయంత్రం 5.30కి దిల్లీకి బయల్దేరుతారు

*link Media సౌజన్యంతో*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment