Wednesday, August 12, 2020

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు DGP గారి విజ్ఞప్తి

హైదరాబాద్ : 12/08/2020

*రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి*
సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. *సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరు లో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు.* శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. *సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు*
ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు.
*ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు*. కాగా, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ *సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే*. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. *సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.*

*Source* :
@TelanganaDGP

*ప్రజలు అందరు కూడా తెలంగాణ DGP సర్ చెప్పినట్లు నడుచుకోవాలని పోలీస్ శాఖ కు సహకరించాలని  ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment