Thursday, August 13, 2020

తెలంగాణ ప్రభుత్వం -కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 14/08/2020

*గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్ గారికి నమస్కారం 🙏*

సర్,

గత కొన్ని నెలల క్రితం *మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్* లో ఎంతో హాట్టహాసంగా మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభించిన *రామంతాపూర్ హోమియో కాలేజీ లో కరోనా పరీక్షలు* కొన్ని రోజులే పని చేసింది ఎందుకు ??? జవాబు చెప్పాలి సారు *మంత్రి గారు అధికారులు.*

సారు *అదే ఆసుపత్రి పెద్ద సారు రిటైర్మెంట్ అయితే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఆ సారుకు పదవీ కాలం పొడగించింది. మరి *తెలంగాణ ప్రభుత్వానికి ఈ సారు మీద వున్న శ్రద్ద ప్రజల ఆరోగ్యభద్రత మీద లేదు*

సారు *తెలంగాణ యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు ఇప్పుడు GHMC ఎన్నికలు వస్తున్నాయి అని చాలా హడావిడి చేస్తున్నాడు ట్విట్టర్ లో అలాగే కొన్ని పత్రికల ద్వారా మరి మా లాంటి సంస్థలు వాస్తవాలు చెపితే మాత్రం పట్టించుకోవడం లేదు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ?? **

సారు *ప్రజలలో మార్పులు వస్తున్నాయి, ప్రజలే జవాబు చెపుతారు GHMC ఎన్నికలలో. ప్రభుత్వ అధికారులు ప్రజల ప్రయోజనాల కన్నా మీకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలో తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి **

సారు దయచేసి *చరిత్ర ఒక్కసారి చూసుకుంటే ఎందరో రాజకీయ ఉద్ధండులు ప్రజల మనోభావాలతో ఆడుకుంటే ఏమి సాధించుకున్నారో అందరికి తెలుసు. కావున ప్రజా అభిప్రాయం తెలుసు కొని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి ఏ పార్టీ నాయకులు అయినా 🙏**

*Copy to Group link Media*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment