Saturday, August 22, 2020

తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయురాలు

హైదరాబాద్ : 22/08/2020

*ఉత్తమ ఉపాధ్యాయురాలిని  సత్కరించిన సిపి*

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. *మలక్‌పేటలో నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉమ్మాజీ పద్మప్రియ 2020 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో సీపీ ఆమెకు అభినందనలు తెలిపి సత్కరించారు*. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌పై ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు.
*తెలంగాణ నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పద్మప్రియ ఎంపికవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు*. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఏసీపీ వెంకట రమణ, ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పాల్గొ్న్నారు.

*ప్రజా సంకల్పం & link Media ఉమ్మాజి పద్మప్రియ మేడం గారు ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికైన సందర్బంగా అభినందనలు తెలియచేస్తుంది 🙏*

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment