Monday, August 29, 2022

వికటించిన కుటుంబ నియంత్రణ

*వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్....ఇద్దరు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా*

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫైయిలై ఇద్దరు మృతి చెందారు.
ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.

ఇది చేసిన రెండు రోజుల తర్వాత నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మాడుగులకు చెందిన మమత కాగా, మరొకరు మంచాల మండలం లింగంపల్లికి చెందిన మైలారం సుష్మా. వైద్యుల నిర్లక్ష్యంతోనే వీరివురు మరణించారని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment