Wednesday, August 17, 2022

పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బిజెపి.... తెలంగాణ నుంచి అతనికే చాన్స్

*పార్లమెంటరీ బోర్డును ప్రకటించిన బిజెపి.... తెలంగాణ నుంచి అతనికే చాన్స్*

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా..11 15 మంది సభ్యులతో బీజే పీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఇక, తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లోనూ అవకాశం దక్కింది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ, నడ్డా బీఎస్‌ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జాతియా, బీఎల్‌ సంతోష్‌లను సభ్యులుగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డును జేపీ నడ్డా నియమించారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలంగాణ నుంచి ఎంపీ కే లక్షణ్‌కు అవకాశం లభించింది. ఇక కొత్త పార్లమెంటరీ బోర్డులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు స్థానం దక్కలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment