Tuesday, August 9, 2022

తక్షణమే 50లక్షల వ్యాక్సిన్ లు పంపండి కేంద్రానికి.....మంత్రి హరీష్ రావు లేఖ

*తక్షణమే 50లక్షల వ్యాక్సిన్ లు పంపండి కేంద్రానికి.....మంత్రి హరీష్ రావు లేఖ*

హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత ఉందని.. వెంటనే పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు.ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. రోజుకు 1.5లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని.. డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా కావడం లేదన్నారు. తక్షణమే 50లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపాలని కేంద్రమంత్రిని కోరారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment