Thursday, February 4, 2021

టెన్త్‌తో తపాలా ఉద్యోగం

హైదరాబాద్ : 05/02/2021

*టెన్త్‌తో తపాలా ఉద్యోగం*
మీ ప్రాంతంలో పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే.. కేంద్రప్రభుత్వ కొలువు పొందే అవకాశం మీకున్నట్టే! రాతపరీక్ష రాయనక్కర్లేదు. ఇంటర్వ్యూకూ హాజరు కానవసరం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3446 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.  

తాజా ప్రకటన ద్వారా బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి.ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26. https:appost.in/gdsonline/Home.aspx వయసు: జనవరి 27, 2021 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాం గులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.బేసిక్‌ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

*తీన్మార్ మల్లన్న Q న్యూస్*

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment