Sunday, February 28, 2021

ఓయు సాక్షిగా చర్చకు రెడీ..... కేటీఆర్ కు రాంచందర్ రావు(బీజేపీ MLC అభ్యర్థి)సవాల్

హైదరాబాద్ : 28/02/2021

*ఓయు సాక్షిగా చర్చకు రెడీ.....  కేటీఆర్ కు రాంచందర్ రావు(బీజేపీ MLC అభ్యర్థి)సవాల్......!*

ఉద్యోగాల కల్పనపై ఓయూ సాక్షిగా చర్చకు రెడీనా అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఓయూకి కేటీఆర్‌ రావాలని రామచంద్రరావు సూచించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కేటీఆర్‌తో చర్చకు తాము సిద్ధమన్నారు. ఓయూకి వెళ్లేందుకు తమ నేతలకు పోలీసులు అనుమతించలేదన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరికి ఎలాగైనా వెళ్తామని రామచంద్రరావు తెలిపారు.

*link Media🖋️*

హైదరాబాద్ : 28/02/2021
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి అని గొప్ప గొప్ప ప్రగలభాలు పలుకుతున్న కేటీఆర్ సారు & బీజేపీ అభ్యర్థి ఇద్దరు కూడా నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేశారు ఇది అక్షరాలా సత్యం. ఇప్పుడు మీరేమి చేశారు అంటే మీరేమి చేశారు అని డ్రామాలు చేసుకుంటూ తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకోలేదు ఎందుకు??. రాంచందర్ రావు సర్ గారు అసలు మీరు ఏమిచేసారో చెప్పండి ఫస్ట్ ?? మీరు చేసింది ప్రక్కన పెట్టి మీలాగే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిన తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి.

*తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాటం చేసిన నిరుద్యోగులు & పట్టభద్రులు అన్నీ గమనిస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు అవుతాయని నేను అనుకుంటున్నాను...ఎందుకంటే ఇవి పట్టభద్రుల ఎన్నికలు అది మరిచిపోవద్దు....Bplkm*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)


No comments:

Post a Comment