Saturday, February 13, 2021

పుల్వామా ఘటనకు రెండేళ్లు

హైదరాబాద్ : 14/02/2021

*పుల్వామా ఘటనకు రెండేళ్లు.. 40 మంది భారత సైనికులు అమరులైన రోజు*

పుల్వామాలో ఉగ్రవాదులు దుశ్చర్య యావత్తు భారతావని కళ్లల్లో ఇంకా మెదలాడుతోంది. ముష్కరమూకలు జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 14) పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు.

*పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంది ప్రజా సంకల్పం & link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment